తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ బ్యాంకు మేనేజర్.. ఆమె కుమార్తెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఇందుకోసం ఆ మహిళ భర్తను చేయించి, చివరకు జైలు పాలయ్యాడు. తెలంగాణా రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన హత్య కేసు వెనుక ఉన్న మిస్టరీని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు వివరించారు. ఆయన గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు.
ఈ నెల 17వ తేదీన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ అదృశ్యం కాగా, 21వ తేదీన గాలేరు - నగరి కాల్వలో ఆయన మృతదేహం లభ్యమైంది. గత యేడాది డిసెంబరు నెలలో ఐశ్వర్య - తేజేశ్వర్కు నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచే తేజేశ్వర్ను హతమార్చేందుకు తిరుమల్ రావు, ఐశ్వర్య కుట్ర చేశారు. ఈ హత్యకు కావాల్సిన డబ్బులను బ్యాంకు మేనేజరు తిరుమల రావు సమకూర్చారు. బ్యాంకులో రుణం కోసం తన వద్దకు వచ్చిన నగేశ్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత తేజేశ్వర్ కదలికలను తెలుసుకునేందుకు అతడి బైకుకు జీపీఎస్ను అమర్చారు.
ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలని తిరుమల్ రావు ప్రణాలిక రచించాడు. హత్య తర్వాత తిరుమల్ రావు, ఐశ్వర్యలు కలిసి లద్దాఖ్ వెళ్లి, అక్కడ నుంచి విదేశాలకు వెళ్లిపోవాలని ప్లాన్ వేశారు. అయితే, తిరుమల్ రావుకు అంతకుముందు నుంచే ఐశ్వర్య తల్లితో అక్రమ సంబంధం ఉంది. ఈ కేసులో ఇప్పటివరకు 8 మంది నిందితులను అరెస్టు చేసినట్టు ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.