బ్లాక్ మాంబా మృతిపట్ల డోనాల్డ్ ట్రంప్ విచారం

సోమవారం, 27 జనవరి 2020 (11:25 IST)
ప్రపంచ బాస్కెట్ బాల్ దిగ్గజం, ఎన్బీఏ లెజండ్ కోబ్ బ్రియాంట్ మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తంచేస్తున్నారు. లాస్ ఏంజిల్స్ శివారులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బ్రియాంట్, ఆయన 13 ఏళ్ల కూతురు గియానా సహా 9 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. 
 
దీనిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. అమెరికా ఓ దిగ్గజ ఆటగాడిని కోల్పోయినట్టు పేర్కొంటూ, తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. దేశంలో బాస్కెట్ బాల్ విస్తరణ, అభివృద్ధికి బ్రియాంట్ ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ఈ దుర్ఘటన అమెరికా క్రీడా చరిత్రలోనే అత్యంత విషాదకరమైనదని ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
బ్రియాంట్ మృతిపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, 'బ్రియాంట్‌, అతడి కుమార్తె మరణవార్త తెలిసి షాక్‌కు గురయ్యాను. ప్రపంచస్థాయి ఆటగాడికి నా కన్నీటి వీడ్కోలు' అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు