తను ఇటీవల అరెస్టయిన సమయంలో తన ఇంటికి పోలీసులు వచ్చారనీ, వారు తమ ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో నా మేనేజర్ తో నా భార్య ఫోను కాల్ చేసిందన్నారు. వెంటనే పోలీసులు నా మేనేజర్ కి కాల్ చేసి నువ్వు మేడంకి ఎందుకు కాల్ చేసావంటూ నిలదీశారనీ, దీన్నిబట్టి నా భార్య ఫోనుని కూడా ట్యాప్ చేసారని అర్థమవుతోందన్నారు. తమ ఫోన్లే కాదు రాష్ట్రంలో చాలామంది నాయకులవి, వారి కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసారంటూ ఆరోపించారు కౌశిక్ రెడ్డి.