రియో ఒలింపిక్స్ క్రీడల్లో మంగళవారం రాత్రి జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సెమీ ఫైనల్లో సింధు 21-19, 12-21, 15-21తో టాప్ సీడ్ మారిన్ చేతిలో ఓటమి పాలై రజతంతో సంతృప్తి పడిన విషయం తెల్సిందే. దీంతో ఒలింపిక్స్లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది. ఈ మ్యాచ్లో తొలి గేమ్ను గెలిచిన సింధు.. ఆపై వరుస రెండు గేమ్లలో ఒత్తిడికిలోనై ఓటమి చెందింది.