ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్ వచ్చే నెలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ప్రపంచ దేశాలకు చెందిన జట్లు ఈ క్రీడోత్సవంలో పతకాల పంట పండించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా మన దేశంలో వివిధ విభాగాల్లో క్రీడాకారులు ధీటుగా రాణిస్తారని ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా టెన్నిస్లో సానియా, బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్, బాక్సింగ్లో విజేందర్, షూటింగ్లో అభినవ్ బింద్రా రాణిస్తారని.. తద్వారా భారత్కు పతకాలు లభిస్తాయని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
అయితే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాత్రం రియో ఒలింపిక్స్లో పతకం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తానని తెలిపింది. ఒకవేళ రియో ఒలింపిక్స్లో పతకాలు సాధించకపోతే.. మరో ఒలింపిక్స్లో పతకాల సాధన కోసం ప్రయత్నిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది. రియో ఒలింపిక్స్లో పతకంతో దేశానికి తిరిగి రావాలనుకుంటున్నానని.. ఒకవేళ అది జరగకపోతే.. మళ్లీ ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది.