ఇంతక ముందు వరుసగా తాను 80 వారాల పాటు నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన సంగతి తెలిసిందే. తద్వారా మహిళల డబుల్స్ విభాగంలో ఎక్కువ రోజులు నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన భారత క్రీడాకారిణిగా సానియా మిర్జా నిలిచింది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్లో... సానియా మీర్జా జోడిని ఓడించిన ఎలీనా వెస్నినా-ఎకతెరీనా మకరోవా (రష్యా) జోడీ విజేతగా నిలిచింది.