తాత్పర్యం : ఓ కృష్ణా...! మరణసమయాన నిన్ను స్మరించుచూ... నీలో ఐక్యమవ్వాలని కోరిక ఉన్నది కాని...! ఆవేళ కఫవాత పైత్యములచే కంఠము మూతపడిపోయి నిన్ను స్మరించగలనో, లేనో? అని తలచి ఇప్పుడే నా 'మానస రాజహంస'ను శతృఅభేద్యమైన "నీపాద పద్మ వజ్రపంజర"మందు ఉంచుతున్నాను తండ్రీ...! అని భావం.