వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

ఠాగూర్

శుక్రవారం, 17 మే 2024 (16:09 IST)
ఈ నెల 13వ తేదీన ఏపీలో జరిగిన అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి శివకుమార్‍‌ దాడి చేసిన బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ప్రాణభయంతో వణికిపోతున్నారు. వైకాపా నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందంటున్నారు. అందువల్ల తనకు తగిన భద్రత కల్పించాలని ఆయన కోరుతున్నారు. ఈ మేరకు ఆయన గుంటూరు జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. కోర్టు ఆదేశాల మేరకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 
 
తన కుటుంబ సభ్యులకు వైకాపా నేతల నుంచి ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరారు. గుర్తు తెలియని వ్యక్తులు తెనాలిలో తమ ఇంటి వద్ద సంచరిస్తున్నారని తెలిపారు. దాడి తర్వాత ఎమ్మెల్యపై కేసు పెట్టారు కానీ, చర్యలు తీసుకోలేదన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఈనెల 13న క్యూలో వచ్చి ఓటేయాలని చెప్పినందుకు సుధాకర్‌ అనే ఓటరుపై ఎమ్మెల్యే దాడి చేశారు. దీనికి ఓటరు కూడా ప్రతిదాడి చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అనుచరులు ఆ ఓటరుపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు