"శ్రీరామ" స్మరణతో పాపాలన్నీ పోగొట్టుకోండి.

FILE
దుష్టశిక్షణ శిక్షరక్షణార్థమై చైత్రశుద్ద నవమినాడు ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంలో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాం.

ఒకసారి పార్వతీదేవి పరమశివుని-కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం. అని విష్ణు సహస్రనామ స్తోత్రమ్‌నకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమన కోరుతుంది.

అందుకు పరమేశ్వరుడు- 'శ్రీరామరామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామతత్సుల్యం రామనామ వరాననే ||' అని మూడుసార్లు స్మరించినట్లైతే ఒక విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, అభేదస్వరూపులమైన మావల్ల భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది సుమా అని పరమేశ్వరుడు పార్వతికి మంత్రోపాసన చేశాడు. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తివశంకరుడే ఈ తారకమంత్రం. ఈ మంత్రాన్ని వారి కుడిచేవిలో చెప్పి నారికి చెప్పడం ద్వారా సద్గతి కలిగిస్తారన్నది విశ్వాసం.

"రామ"యనగా రమించుట అని అర్థం. కావున ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న "ఆ శ్రీరాముని" కనుగొనుచుండవలెను. రామనామధ్యానముతో పాపాలన్నీ దహించివేయబడునని పురోహితులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి