"నేతి చిరోటీ"ని టేస్ట్ చేద్దామా...?

కావలసిన పదార్థాలు :
నెయ్యి... వంద గ్రా.
మైదాపిండి... ఒక కేజీ
బియ్యంపిండి... 120 గ్రా.
ఉప్పు... పావు టీ.
పంచదార పొడి... 700 గ్రా.
యాలకులపొడి... 40 గ్రా.
మిఠాయి రంగు... కాస్తంత
నూనె... సరిపడా

తయారీ విధానం :
మైదా, ఉప్పు, కరిగించిన నెయ్యిని ఒక పాత్రలో వేసి కలపాలి. తరువాత సరిపడా నీళ్లతో ముద్దగా చపాతీపిండిలా కలపాలి (రంగు కావాలనుకునేవాళ్లు ఈ నీళ్లలోనే కలపాలి). ముద్దగా కలిపిన పిండిని దళసరి చపాతీలా వత్తాలి. ఆపై బియ్యప్పిండిలో కొంచెం నెయ్యి కలిపి చేసిన చపాతీమీద అద్దాలి. ఇప్పుడు ఈ చపాతీని చాపలా ఒక వైపు నుంచి చుట్టాలి.

తరువాత దీన్ని 2 అంగుళాల మందంగల ముక్కలుగా కోసి ఒక్కో ముక్కను పొరలు బయటకు వచ్చేలా గుండ్రంగా ఒత్తి, వాటిని కాగుతున్న నూనెలో వేసి దోరగా వేయించాలి. వేడిగా ఉండగానే పంచదార, యాలకులపొడి చల్లి, చల్లారిన తరవాత సర్వ్ చేయాలి.

వెబ్దునియా పై చదవండి