కావలసిన పదార్థాలు : చిక్కటి పాలు... ఒక లీ. కోవా... ముప్పావు కప్పు పంచదార... నాలుగు టీ. పిస్తా.... ఎనిమిది యాలకులపొడి... అర టీ. గులాబీ రేకులు... కాసిన్ని రెడీమేడ్ ఆమ్లా మురబ్బా... ఆరు ముక్కలు
తయారీ విధానం : మందపాటి కళాయిలో పాలను మరిగించి అందులోనే మెత్తగా చిదిమిన కోవా, పంచదార కలపాలి. తక్కువ మంటమీద 45 నిమిషాలపాటు ఉంచి ఉడికించాలి. పాలు సగమై చిక్కగా మారి అంచులకు అంటుకుంటుండగా స్టవ్మీద నుంచి దించాలి. చల్లారిన తరువాత ముక్కలుగా కోసిన పిస్తాపప్పు, యాలకుల పొడి వేసి కలపాలి. ఆమ్లా మురబ్బాను చిన్న చిన్న ముక్కలుగా కోసి రబ్రీలో కలపాలి. చివరిగా దీన్ని ఫ్రిజ్లో పెట్టి చల్లబడ్డాక తీసి గులాబీరేకులతో అలంకరించి అతిథులకు అందించాలి.