కావలసిన పదార్థాలు : క్యారట్ తురుము... ఒక కప్పు మైదాపిండి... 250 గ్రా వేయించిన జీడిపప్పు పలుకులు... పది బాదంపప్పు... పది కొబ్బరి తురుము... రెండు కప్పులు నెయ్యి... 50 గ్రా. పంచదారపొడి... రెండు కప్పులు యాలకుల పొడి... అర టీ. నీళ్లు... ఒకటిన్నర కప్పు
తయారీ విధానం : మైదాపిండికి నెయ్యి, గోరు వెచ్చని నీరు కలిపి పూరీల పిండి మాదిరిగా కలుపుకోవాలి. నిమ్మకాయంత ఉండలు చేసి పక్కన ఉంచాలి. కడాయిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి, కొబ్బరి తురుము, కేరట్ తురుము విడివిడిగా పచ్చిదనం పోయేదాక వేయించాలి. వేగిన తురుమును ఒక పాత్రలోకి తీసుకుని పంచదార, జీడిపప్పు పలుకులు, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
మైదాపిండిని పూరీల్లా వత్తుకుని మధ్యలో మూడు టీ స్పూన్ల తురుము మిశ్రమాన్ని పెట్టి, కజ్జికాయల్లా వత్తుకుని నూనెలో దోరగా వేయించాలి. అంతే వెరైటీగా ఉండే క్యారెట్ కజ్జికాయలు రెడీ అయినట్లే...! క్యారెట్ను విడిగా తినని వారు కూడా ఈ కజ్జికాయలను చాలా ఇష్టంగా తింటారు.