కావలసిన పదార్థాలు : జామూన్ మిక్స్... పావు కేజీ పాల మీగడ... 150 గ్రా. పనీర్ తురుము... అర కేజీ పంచదార... ఒక కేజీ యాలకుల పొడి... ఒక టీ.
తయారీ విధానం : పనీర్ తురుములో మైదా, మీగడ, జామూన్ మిక్స్, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా కలపాలి. ఈ పిండిని అరగంటసేపు నానబెట్టాలి. పంచదారలో తగినన్ని నీళ్లు పోసి లేతపాకం పట్టి ఉంచాలి. పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని గుండ్రని బిళ్లలుగా వత్తి నూనెలో గోధుమ రంగు వచ్చేవరకూ వేయించి తీసేయాలి.