తయారీ విధానం : ముందుగా పాలను మరిగించి చల్లార్చాలి. బాదం, పిస్తాపప్పుల్ని సన్నగా కోయాలి. పచ్చి బఠాణీలను ఉడికించి మెత్తగా మెదపాలి. దీన్ని 20 నిమిషాలపాటు, నేతిలో వేయించాక పంచదార వేసి కరగనివ్వాలి.
మరిగించి చల్లార్చిన పాలనూ, కోవానూ బఠాణీ మిశ్రమంలో కలిపి, పాలన్నీ ఆవిరైపోయే వరకూ ఉడికించాలి. ఇప్పుడు హల్వాను చిన్న చిన్న బౌల్స్లో సర్ది బాదం, పిస్తా పప్పులతో అలంకరిస్తే సరి. అంతేనండి.. వేడి వేడిగా నోరూరించే పచ్చిబఠాణీల హల్వా రెడీ అయినట్లే..! తినేందుకే కాదు, చూసేందుకు కూడా ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ హల్వాను మీరూ ట్రై చేయండి మరి..!