పీకలదాకా మద్యం సేవించి వచ్చి తరగతి గదిలో నిద్రపోయిన తాగుబోతు టీచర్!

ఠాగూర్

గురువారం, 4 సెప్టెంబరు 2025 (14:21 IST)
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచర్... పీకల వరకు మద్యం సేవించి మద్యం మత్తులో పాఠశాలకు వచ్చి తరగతి గదిలోనే గుర్రుపెట్టి నిద్రపోయాడు. ఈ ఆసక్తికర ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ విషయం తెలుసుకున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన ఆ టీచర్‌ను సస్పెండ్ చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం సుకుత్ పల్లి ఆశ్రమ పాఠశాలలో ఎస్.జి.టిగా జె.విలాస్ అనే వ్యక్తి పని చేస్తున్నారు. అయితే, ఆయన ఇటీవల మద్యం సేవించి పాఠశాలకు హాజరయ్యారు. మద్యం మత్తులో తరగతి గదిలోనే నిద్రలోకి జారుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 
 
గ్రామస్థులు నుంచి అందిన ఫిర్యాదుపై అధికారులు వెంటనే స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ప్రాజెక్టు ఆఫీసర్ ఆదేశాలు జారీచేశారు. విచారణలో ఉపాధ్యాయుడు విలాస్ నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలడంతో ఆయనను తక్షణం విధుల నుంచి సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు