హైదరాబాద్ నుండి విజయవాడకు మొదటి ఫ్లిక్స్‌బస్ ఇండియా ఎలక్ట్రిక్ బస్సు

ఐవీఆర్

గురువారం, 6 ఫిబ్రవరి 2025 (16:09 IST)
హైదరాబాద్: ప్రపంచ ట్రావెల్-టెక్ లీడర్ అయిన ఫ్లిక్స్‌బస్ ఇండియా, భారతదేశంలో తమ మొదటి ఎలక్ట్రిక్ బస్సు మార్గాన్ని ప్రారంభించడంతో తమ తొలి వార్షికోత్సవాన్ని వేడుకగా జరుపుకుంది, ఇది Co2 ఉద్గారాలను తగ్గించడం, పర్యావరణ అనుకూల ప్రయాణ అవకాశాలను ప్రోత్సహించడం అనే దాని నిబద్ధతలో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుంది. ఈటిఓ మోటర్స్‌ భాగస్వామ్యంతో ఫ్లిక్స్‌బస్ ఇండియా చేపట్టిన ఈవీ బస్సు కార్యకలాపాలను హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్లో తెలంగాణ ప్రభుత్వ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీలోని జర్మన్ రాయబార కార్యాలయంలో డిజిటల్, రవాణా కౌన్సెలర్ శ్రీ అలెగ్జాండర్ రెక్; థండర్ ప్లస్ సీఈఓ- ఈటిఓ గ్రూప్ గ్రూప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీ రాజీవ్ వైఎస్ఆర్, ఫ్లిక్స్‌బస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సూర్య ఖురానా కూడా హాజరయ్యారు.
 
ఈ ప్రారంభోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ  మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “ఫ్లిక్స్‌బస్, ఈటిఓ మోటర్స్ కలిసి సాంకేతిక ఆధారిత ప్రత్యామ్నాయంతో తెలంగాణ, దక్షిణ భారత దేశంలోని ప్రజల సుదూర పర్యావరణ అనుకూల ప్రయాణ అవసరాలను తీరుస్తాయి. రెండు కంపెనీలకు మేము అభినందనలు తెలియజేస్తున్నాము. దేశవ్యాప్తంగా ఈ-బస్సుల స్వీకరణను వేగవంతం చేయడంలో వారు సహాయపడతారని ఆశిస్తున్నాము” అని అన్నారు. 
 
ఈ ఈవీ పైలట్ ప్రాజెక్టు  హైదరాబాద్-విజయవాడ మార్గంలో నాలుగు ఎలక్ట్రిక్ బస్సులతో ప్రారంభించబడుతుంది, ఇది సాధ్యాసాధ్యాలను అంచనా వేయడం, హబ్-అండ్-స్పోక్ మోడల్ ద్వారా విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి చివరిలో ప్రారంభమయ్యే కార్యకలాపాలకు ముందు రెండు వారాల టెస్ట్ రన్ జరుగుతుంది, తరువాత బ్యాటరీ పనితీరు, ప్రయాణీకుల బుకింగ్ విధానాల వంటి కొలమానాల ఆధారంగా 12 వారాల పాటు  మూల్యాంకనం ఉంటుంది. థండర్ ప్లస్ మద్దతుతో, 240 KW ఫాస్ట్ ఛార్జర్‌లతో డిపో కమ్ ఆపర్చునిటీ ఛార్జింగ్ స్టేషన్‌లు సామర్థ్యాన్ని నిర్ధారిస్తాయి, బ్యాటరీ వేడెక్కడాన్ని నివారిస్తాయి. అధునాతన ఈవీ  ఫ్లీట్‌లో డాష్‌క్యామ్‌లు, GPS, ADAS, ఇతర భద్రతా అంశాలు  సజావుగా ప్రయాణ అనుభవం కోసం ఉంటాయి.
 
ఈ మైలురాయి గురించి ఫ్లిక్స్‌బస్ ఇండియా ఎండి సూర్య ఖురానా మాట్లాడుతూ, “ఫ్లిక్స్‌బస్ ఇండియా తన తొలి సంవత్సరంలోనే ట్రైల్‌బ్లేజర్‌గా ఉద్భవించింది, దేశవ్యాప్తంగా 200+ నగరాలను సాంకేతికతతో నడిచే, సమర్థవంతమైన, సరసమైన, సౌకర్యవంతమైన బస్సు సేవలతో అనుసంధానిస్తుంది. ఇప్పుడు, ప్రత్యామ్నాయ ఇంధనాలను అన్వేషించడానికి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి దాని వైవిధ్యమైన, టెక్-అజ్ఞేయ వ్యూహంలో భాగంగా నాలుగు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా కంపెనీ పర్యావరణ అనుకూల ప్రయాణాల పట్ల తన నిబద్ధతను వెల్లడించేందుకు మరో అడుగు ముందుకు వేస్తోంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ భారతదేశం యొక్క ప్రత్యేకమైన ప్రయాణ సవాళ్లను కూడా పరిష్కరించడంతో పాటు మన దేశం యొక్క పర్యావరణ అనుకూల లక్ష్యాలకు అనుగుణంగా ఫ్లిక్స్‌బస్ ఇండియా చేస్తున్న ప్రయత్నాలను ప్రదర్శిస్తుంది" అని అన్నారు.  
 
ఈటిఓ మోటర్స్ గ్రూప్ సీఎంఓ రాజీవ్ వైఎస్ఆర్  మాట్లాడుతూ, "ఫ్లిక్స్‌బస్ ఇండియాతో మా సమ్మిళిత విధానం పర్యావరణ అనుకూల చలనశీలత పరిష్కారాల ద్వారా ఇంటర్‌సిటీ ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చడంలో ఒక ముందడుగుగా నిలుస్తుంది. ఎలక్ట్రిక్ వాహన సాంకేతికత, ఫ్లిక్స్‌బస్ యొక్క విస్తృతమైన నెట్‌వర్క్‌లో మా నైపుణ్యం, పర్యావరణ అనుకూల రవాణాకు కొత్త ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. ఈ భాగస్వామ్యంతో, మేము ఇప్పుడు ప్రయాణికులకు ఇంటర్‌సిటీతో పాటు మొదటి మైలు, చివరి మైలుకు సేవలు అందిస్తున్నాము. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం రేపటిని మరింత స్వచ్ఛంగా, హారితంగా సృష్టించాలనే మా ఉమ్మడి లక్ష్యంను ప్రతిబింబిస్తుంది" అని అన్నారు.
 
దాని విజయవంతమైన మొదటి సంవత్సరం కార్యకలాపాలలో, ఫ్లిక్స్‌బస్ ఇండియా దక్షిణ భారతదేశంలో 75కు పైగా, ఉత్తరాన 140కు పైగా నగరాలతో సహా 200 కి పైగా నగరాలను అనుసంధానించింది. ఈ నెట్‌వర్క్ బెంగళూరు-హైదరాబాద్, బెంగళూరు-చెన్నై, చెన్నై-మధురై, ఢిల్లీ-లక్నో, ఢిల్లీ-మనాలి, డెహ్రాడూన్- ఢిల్లీ వంటి ప్రసిద్ధ, అధిక రేటింగ్ ఉన్న రూట్‌లతో దక్షిణాదిలో 400కి పైగా, ఉత్తరాదిలో 500కి పైగా కనెక్షన్‌లను అందిస్తుంది. ఫ్లిక్స్‌బస్ గడిచిన ఏడాది కాలంలో నెలవారీ రైడర్‌షిప్‌లో ఆరు రెట్లు పెరుగుదలను సాధించగలిగింది.
 
చిన్న-మధ్య తరహా బస్సు ఆపరేటర్లు తమ కార్యకలాపాలను మెరుగ్గా నిర్వహించడానికి, తమ కార్యకలాపాలను విస్తరించటానికి తోడ్పడే దాని యాజమాన్య సాంకేతికత, సాధనాలకు అవకాశాలను ఫ్లిక్స్‌బస్ అందిస్తుంది. నెట్‌వర్క్ ప్లానింగ్, ఆదాయ నిర్వహణ, రాబడి పెరుగుదల కోసం దాని ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుంటూ, స్థానిక బస్సు ఆపరేటర్లతో కంపెనీ వ్యూహాత్మక సహకారాన్ని కొనసాగిస్తుంది. నాణ్యత, భద్రత, అసాధారణమైన కస్టమర్ సేవపై బలమైన దృష్టితో, ఫ్లిక్స్‌బస్ ఆపరేటర్లకు స్థిరమైన వృద్ధిని సాధిస్తూనే ప్రయాణీకులకు సమర్థవంతమైన, సజావుగా సేవలను అందిస్తుంది. భవిష్యత్తులో, ఫ్లిక్స్‌బస్ బలమైన పాన్-ఇండియా ప్రయాణ నెట్‌వర్క్‌ను సృష్టించడానికి కనెక్షన్‌లను మరింత విస్తరించాలని యోచిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు