హైదరాబాద్: కుటుంబ కలహాలు.. భార్యను హత్య చేసిన భర్త

సెల్వి

బుధవారం, 27 మార్చి 2024 (11:55 IST)
కుటుంబ కలహాల కారణంగా ఓ వివాహిత భర్త చేతిలో హత్యకు గురైంది. మంగళవారం రాత్రి కుటుంబ సమస్యలతో నగరంలోని కుల్సుంపురా వద్ద భార్యను భర్త హత్య చేశాడు. సయ్యద్ సలీమ్ (43) అనే భర్త మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత ఆమె గొంతుకోసి హత్య చేశాడని ఆరోపించారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. సలీం తన భార్యతో తరచూ గొడవపడేవాడని, కుటుంబ పెద్దలు అతనికి కౌన్సెలింగ్‌ ఇచ్చారని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు