హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాలు తీసింది. ఆమె ప్రియుడు మాత్రం కొనఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, గొంతుపై కత్తిగాట్లతో పడివుండటం అనుమానాలను రేకత్తిస్తోంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఏపీలోని విజయనగరం జిల్లా బాడంగి మండలం గజరాయునివలస గ్రామానికి చెందిన బొత్స శ్రీనివాస్, ఈశ్వరమ్మ దంపతులు 25 ఏళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు.
ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో యువతి తల్లి ఈశ్వరమ్మ ఇంటికి వచ్చేసరికి లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. కిటికీలోంచి పరిశీలించగా రమ్య గొంతుపై తీవ్ర గాయంతో రక్తపు మడుగులో ఉంది. ఆ పక్కనే మెడమీద గాయంతో ప్రవీణ్ పడి ఉన్నాడు. స్థానికుల సాయంతో లోపలికి వెళ్లి చూడగా రమ్య మృతి చెందింది. ప్రవీణ్ కొన ఊపిరితో ఉండడంతో 108 వాహనంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందుతోంది.