తెలంగాణాలో పోలింగ్ సమయం పొడగింపు... ఎందుకో తెలుసా?

ఠాగూర్

బుధవారం, 1 మే 2024 (21:56 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరుగనుంది. తెలంగాణ రాష్ట్రంలో లోక్‍‌సభ స్థానాలకు పోలింగ్ జరిగితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు కలిసి ఒకేసారి పోలింగ్ నిర్వహించనున్నారు. సాధారణంగా పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. కానీ, తెలంగాణాలో మాత్రం సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని పార్టీల విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. 
 
తెలంగాణతో పాటు ఏపీ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిల్లో నమోదవుతున్నాయి. వీటికితోడు వడగాలులు బలంగా వీస్తున్నాయి. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. దీంతో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెనుకంజ వేస్తారని భావించిన రాజకీయ పార్టీల నేతలు... పోలింగ్ సమయాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశాయి. ఈ వినతిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ... తెలంగాణాలో మాత్రం పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడగించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు