ఆత్మహత్య చేసుకున్న న్యూస్ యాంకర్ స్వేచ్ఛతో తనకు సన్నిహిత సంబంధం ఉన్నమాట నిజమేనని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ వెల్లడించారు. స్వేచ్ఛ మరణానికి తానే కారణమంటూ ఆమె తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన మీడియాకు ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఆయన పలు సంచలన విషయాలను వెల్లడిస్తూ, స్వేచ్ఛ జీవితంలోని విషాద కోణాలను ఆమెకు తనతో ఉన్న సంబంధాన్ని వివరించారు. తనపై వస్తున్న అబద్ధపు ప్రచారాన్ని ఆపడానికే ఈ నిజాలు చెప్పాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు.
తనకు స్వేచ్ఛ 2009 నుంచి తెలుసని, ఇద్దరూ కలిసి టీ-న్యూస్లో పని చేసేటపుడు మంచి స్నేహితులమని చెప్పారు. ఆ సమయంలో స్వేచ్ఛ తన వ్యక్తిగత విషయాలను పంచుకునేదని గుర్తు చేసుకున్నారు. అయితే, 2020 నుంచే తమ మధ్య సాన్నిహిత్యం పెరిగిన మాట నిజమేనని ఆయన అంగీకరించారు. రెండు విడాకుల తర్వాత తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతున్న స్వేచ్ఛకు తాను అండగా నిలిచానని చెప్పారు.