హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు రంగం సిద్ధమైంది. దీంతో జూలై 20 ఆదివారం, జూలై 21 సోమవారం రెండు రోజుల పాటు సెలవులు రానున్నాయి. బోనాల జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున, శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.