ఐఎంజీ సంస్థకు భూములు.. పిటిషన్లను కొట్టేసిన కోర్టు.. బాబుకు ఊరట

సెల్వి

బుధవారం, 11 సెప్టెంబరు 2024 (19:01 IST)
ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న సమయంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు ఐఎంజీ అనే సంస్థకు కేటాయించిన భూములపై విచారణ చేయాలని దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. అక్రమాలు జరిగాయనడానికి ఆదారాల్లేవని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. 
 
క్రీడా సంబంధిత అంశాల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరిచేందుకు అమెరికాకు చెందిన ఐఎంజీ కంపెనీ సబ్సిడరీ అయిన ఐఎంజీ భరతకు భూములు కేటాయించారు. కేబినేట్ నిర్ణయానికి అనంతరం ఈ భూముల కేటాయింపు జరిగింది. 
 
అయితే తదుపరి జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ ఓటమి పాలైంది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ కేటాయింపుల్ని రద్దు చేశారు.
 
అయితే ఆ భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఈ భూములు కేటాయింపులపై విచారణ చేయించాలని 2012లో హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. 
 
 వీటిని  సీనియర్ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్ , వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది శ్రీరంగారావు దాఖలు చేశారు. అంటే భూముల కేటాయింపులు కూడా రద్దు చేసిన  తొమ్మిదేళ్ల తర్వాత అక్రమాలని  పిటిషన్లు వేశారు. 
 
వీటిని ఇటీవల తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇంకా ఈ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఇందులో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు