జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారాస గూబ గుయ్యమనేలా ఓటర్ల తీర్పు ఉంటుంది : పొన్నం ప్రభాకర్

ఠాగూర్

మంగళవారం, 14 అక్టోబరు 2025 (14:39 IST)
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చే నెలలో ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో భారత రాష్ట్ర సమితి గూబ గుయ్యిమనేట్లు ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారని మంత్రి పొన్నాల ప్రభాకర్ జోస్యం చెప్పారు. ఈ ఉప ఎన్నికలో ఆ పార్టీ చిరునామా గల్లంతవుతుందన్నారు. 
 
పదేళ్లలో ఆ పార్టీ పాలనలో జూబ్లీహిల్స్‌లో ఏం అభివృద్ధి జరిగిందో చర్చకు రావాలని ఆయన భారాస నేతలకు సవాల్ విసిరారు. 'అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని ఓడగొట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్ల నమోదుకు భారత రాష్ట్ర సమితి, భాజపాలదే బాధ్యత. మాగంటి సునీతతో కన్నీరు పెట్టిస్తూ.. గులాబీ పార్టీ ఓట్లు దండుకోవాలని చూస్తోంది' అని పొన్నం విమర్శించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు