సెల్ఫీ కోసం కాలు జారి కాలువలో పడిన మహిళ (Video)

ఐవీఆర్

శనివారం, 31 ఆగస్టు 2024 (13:59 IST)
తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షం సమయంలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలి. ఐతే కొంతమంది వర్షంలో కాస్త ప్రకృతి అందాల మధ్య సెల్ఫీలు కోసం ప్రయత్నించి ప్రమాదంలో పడుతున్నారు. ఇలాంటి ఘటన ఒకటి జరిగింది.
 
తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ వేములపల్లి కేంద్రంలోని నాగార్జున సాగర్ ఎడమ కాల్వ మీదుగా హైదరాబాదు నుంచి మిర్యాలగూడకు ఓ కుటుంబం వెళుతోంది. ఐతే కాల్వ ఒడ్డున సెల్ఫీ తీసుకోవాలనే సరదా ఓ మహిళకు ప్రమాదాన్ని తెచ్చింది. మరీ కాలువ ఒడ్డుకు వెళ్లి సెల్ఫీ తీసుకునే క్రమంలో ఆమె కాలు జారి కాలువలో పడిపోయింది. వెంటనే గమనించిన స్థానికులు ఆమెను తాళ్ల సహాయంతో కాపాడారు. సుమారు 40 నిమిషాల పాటు కాలువలో స్థానికులు ప్రాణాలొడ్డి ఆమెను కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడిన మహిళ.. 40 నిమిషాల పాటు శ్రమించి కాపాడిన స్థానికులు

నల్గొండ - వేములపల్లి మండల కేంద్రంలోని నాగార్జునసాగర్ ఎడమ కాల్వ వద్ద హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న కుటుంబ సభ్యులు సెల్ఫీ తీసుకుంటుండగా అందులో ఓ మహిళ ప్రమాదవశాత్తు… pic.twitter.com/SyGlo7DqsX

— Telugu Scribe (@TeluguScribe) August 31, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు