సెల్ఫీ తీసుకుంటూ 150 అడుగుల లోయలో పడిపోయింది.. (video)

వరుణ్

ఆదివారం, 4 ఆగస్టు 2024 (18:32 IST)
selfie
మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని బోర్న్ ఘాట్ వద్ద  సెల్ఫీ తీసుకుంటుండగా ఓ మహిళ 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. అడ్వెంచర్లు,   పర్వతారోహకులతో కూడిన రెస్క్యూ టీమ్ ఆ మహిళను రక్షించింది. 
 
ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న పూణేకు చెందిన ఎనిమిది మంది బృందంలో ఆమె భాగం. సెల్ఫీ తీసుకుంటూ ఓ మహిళ 150 అడుగుల లోతున్న గుంతలో పడిపోయింది. 
 
రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని మహిళను సురక్షితంగా ప్రాణాలతో కాపాడింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ ఈ వీడియోలో ఆమెను ఓ మందపాటి తాడుతో కాపాడినట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

மராட்டியம்: செல்பி எடுக்கும் போது பெண் ஒருவர் 150 அடி ஆழ பள்ளத்தில் தவறி விழுந்த சம்பவம் பரபரப்பை ஏற்படுத்தியுள்ளது. சம்பவ இடத்திற்கு விரைந்து வந்த மீட்புக் குழுவினர் அப்பெண்ணை பத்திரமாக உயிருடன் மீட்டனர்.#Maharashtra #FriendshipDay #selfie #DailyThanthi pic.twitter.com/XGQ8ui3M4B

— DailyThanthi (@dinathanthi) August 4, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు