నన్నొదిలేసి వేరేవాడితో తిరుగుతుంటే ఓర్చుకోలేక రేప్ చేసి చంపేశా....

శుక్రవారం, 11 మే 2018 (10:55 IST)
తనను కాదన్నందుకు ఓ యువతిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన హైదరాబాద్ శివార్లలోని ప్రగతి రిసార్ట్సులో చోటుచేసుకుంది. తనను ప్రేమించి మరొకడితో తిరుగుతోందన్న కక్షతో ఆమెను నమ్మకంగా తీసుకెళ్లి అత్యంత దారుణంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళితే... నిన్న మధ్యాహ్నం డిగ్రీ విద్యార్థిని శిరీషను హైదరాబాద్ నగర శివార్లలోని ప్రగతి రిసార్ట్స్‌కు సాయిప్రసాద్ తీసుకెళ్లాడు. 
 
తనను పెళ్లాడాలని బ్రతిమాలాడు. ఆమె ససేమిరా అనేసరికి ఆమెపై ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమెను ప్రతిఘటించినప్పటికీ లాభంలేకపోయింది. ఆపై ఆమె వాష్ రూముకు వెళ్లి ముఖాన్ని సబ్బుతో కడుక్కుంటున్న సమయంలో వెనుక నుంచి వెళ్లి ఆమె గొంతు కోసేశాడు. ఆపై ఆమె ఛాతీపైన పొడిచి హత్య చేశాడు. హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు చెప్పిన విషయాలు షాకింగ్‌గా మారాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు