అసదుద్దీన్ ఉదార స్వభావం... అలా చేసి పూజారి ప్రాణాలు రక్షించారు..

శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (09:00 IST)
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని పక్కా హిందూ ద్వేషిగా చాలా మంది భావిస్తుంటారు. కానీ, ఆయనలో చాలా ఉదారస్వభావం ఉందని మరోమారు నిరూపించారు. కరోనా వైరస్ బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ హిందూ ఆలయ పూజారికి ఆస్పత్రిలో ఓ పడక ఇప్పించి అందరి మనస్సులను గెలుచుకున్నారు. 
 
తాజా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిసీలిస్తే, హైదరాబాద్ పాతబస్తీలోని ఓ ఆలయం ఉంది. ఇక్కడ 75 ఏళ్ల పూజారి పనిచేస్తున్నారు. ఈయనకు గత శనివారం కరోనా వైరస్ సోకింది. 
 
అప్పటి నుంచి ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో గురువారం కొంత అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించే ప్రయత్నం చేశారు.
 
అయితే, ఎక్కడా బెడ్స్ అందుబాటులో లేకపోవడంతో వారిలో ఆందోళన మరింత పెరిగింది. ఈ క్రమంలో స్థానిక మజ్లిస్ నేత సాయంతో అసదుద్దీన్‌కు పరిస్థితి వివరించారు. ఆ వెంటనే స్పందించిన అసద్ శాలిబండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి పూజారికి బెడ్ ఇప్పించి ఉదారత చాటుకున్నారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు