ప్రతి ఇంట్లో బాపుగారు గీసిన బొమ్మలు, ఆయన తీసిన సినిమాలు ఉండటం ఆనవాయితీ. కృష్ణగారు-మా అమ్మ విజయనిర్మల జంటగా నటించిన 'సాక్షి' చిత్రం ద్వారా బాపుగారు దర్శకులుగా పరిచయమయ్యారు. మా అమ్మగారు ఒక దర్శకురాలిగా బాపుగారిని తన గురువుగా భావిస్తుంటారు. మా అమ్మగారితో తీసిన 'బంగారు పిచ్చుక' చిత్రాన్ని బాపుగారు నాతో 'పెళ్లికొడుకు' పేరుతో రీమేక్ చేయడం మర్చిపోలేని అనుభూతి.