శంషాబాద్ ఎయిర్‌పోర్టులు గ్యాస్ లీక్... ఒకరు మృతి

శుక్రవారం, 18 జూన్ 2021 (10:52 IST)
హైదరాబాద్ నగరంలో వున్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రంలో గ్యాస్ లీకైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ గ్యాస్ లీక్ కావడంతో ఊపిరాడక ముగ్గురు వ్యక్తులు స్పృహ కోల్పోయారు. వీరిని విమానాశ్రయ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 
 
ప్రస్తుతం ఈ ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో నర్సింహా రెడ్డి (42) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు బాధితులైన జాకీర్, ఇలియాస్‌లు సురక్షితంగా ఉన్నారు. గ్యాస్ పైప్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నట్టు శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు