దేశంలో అత్యధికంగా మాంసాహారం భుజించే వారి సంఖ్య హైదరాబాద్లోనే ఎక్కువగా ఉన్నారంటే నమ్ముతారా...? నిజంగా అన్ని దేశాలతో ఢిల్లీ ముందుంది. కానీ తాజాగా నిర్వహించిన సర్వేలో ఢిల్లీ కంటే నాన్వెజ్ లాగించడంలో హైదరాబాదీ వాసులే ముందున్నట్లు తేలింది. దాదాపు 30 శాతం హైదరాబాద్ వాసులు మటన్ని తినడానికి ఇష్టపడితే, ఢిల్లీ వాసుల్లో 7.3 శాతం మంది మటన్ తినేందుకు ఇష్టపడతారట.
ఇక చికెన్ విషయానికొస్తే.. 55.85 శాతం మంది హైదరాబాద్ వాసులు ఎక్కువగా కోడిమాంసంను ఇష్టపడుతుండగా, ఢిల్లీ వాసుల్లో 6.6 శాతం మంది చికెన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఏదేమైనా మాంసాహారంతో తెలంగాణ వాసులకి ఎప్పటినుంచో విడదీయరాని అనుబంధం ఉంది. మాంసం లేకుంటే ఒక ముద్ద కూడా మింగుడు పడదు.
హైదరాబాద్ వాసులు మొదట హోటల్కి వెళ్తే ఏం ఆర్డర్ ఇస్తారో తెలుసా...? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీలే కామన్గా ఆర్డర్ చేయడం జరుగుతుందని సర్వేలో తేలింది. ఇందులో మటన్కే ఎక్కువ ప్రాధాన్యత ఉందట. విపరీతమైన నాన్వెజ్తో తినడంతో పలు ఆరోగ్యసమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాని హైదరాబాద్లో హలీం చాలా ఫేమస్.