రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రికి తరలించిన మంత్రి కేటీఆర్

మంగళవారం, 1 నవంబరు 2022 (18:11 IST)
మునుగోడు ఉప ఎన్నిక ప్రచం ముగించుకుని తెరాస మంత్రి కేటీఆర్ తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన రోడ్డుపక్కన క్షతగాత్రులు పడివుండటాన్ని గమనించారు. ఆ వెంటనే ఆయన తన కాన్వాయ్‌ను ఆపి తన కాన్వాయ్‌లోని ఓ కారులో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
మునుగోడు ఎన్నికల ప్రచారానికి హాజరై ఆయన హైదరాబాద్ నగరానికి తిరిగి వెళుతుండగా, రోడ్డు ప్రమాదానికి గురైన దంపతులను చూసిన కేటీఆర్ తన కాన్వాయ్‌ను ఆపారు. కారు దిగి రోడ్డు ప్రమాద బాధితులను ఎక్కించుకుని ఆయన పరామర్శించారు. అనంతరం వారిని తన కాన్వాయ్‌లోని ఓ కారులో వారిని ఎక్కించుకుని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. 


 

మంత్రి శ్రీ @KTRTRS గారి మునుగోడు ప్రచారం ముగించుకొని తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. బైక్ పై వెళ్తున్న ఇద్దరు భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో గాయపడింది చూసి తన కారును ఆపి స్వయంగా తన కాన్వాయ్ వాహనంలో హైదరాబాద్ లోని హాస్పిటల్ కి తరలించారు. pic.twitter.com/n9dqWZXe9G

— Thirupathi Bandari (@BTR_KTR) November 1, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు