అయితే, అల్లు అరవింద్ తల్లి నాగ రత్నమ్మ గారు ఇటీవల మరణించినందున, సరైన సమయం గురించి పండితులను సంప్రదించిన తర్వాత నిశ్చితార్థం, వివాహం జరుగుతుంది. అల్లు శిరీష్ చివరిగా 2024లో విడుదలైన బడ్డీలో కనిపించాడు. అయితే దీనిపై ఇంకా అల్లు కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
సినీ పరిశ్రమలో అల్లు అర్జున్ హీరోగా సూపర్స్టార్ స్థాయికి చేరుకున్న తర్వాత, ఆయన తమ్ముడు శిరీష్ గౌరవం అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయ్యాడు. కాగా, హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్తో అల్లు శిరీష్ సీక్రెట్ రిలేషన్ నడుస్తోందని బోలెడన్ని వార్తలు షికారు చేశాయి.