మూడున్నరేళ్ళ పాపపై లైంగికదాడికి చేసిన వలస కార్మికుడు... అరెస్టు

ఆదివారం, 11 జులై 2021 (09:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చ‌ల్ జిల్లా దమ్మాయిగూడ‌లో మూడున్న‌రేళ్ల పాపను కిడ్నాప్ చేసి.. ఆపై లైంగిక దాడికి పాల్ప‌డిన కేసులో అసలు నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వారం రోజుల రాచకొండ పోలీసులు ఆ కామాంధుడిని గుర్తించి పట్టుకున్నారు. అభంశుభం తెలియని చిన్నారిపై ఘోరానికి ఒడిగ‌ట్టిన ఒడిశాకు చెందిన వలస కార్మికుడు అభిరామ్ దాస్ (40)గా గుర్తించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, దమ్మాయిగూడకు చెందిన మూడున్నరేళ్ళ చిన్నారి ఈ నెల 4వ తేదీ సాయంత్రం మొదటి బాధితురాలిని కిడ్నాప్ చేసిన వలస కార్మికుడు అభిరామ్ దాస్ .. చిన్నారిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి, రాత్రి సమయంలో అత్యాచారం చేసిన‌ట్టుగా పోలీసులు గుర్తించారు. మరుసటి రోజు ఉదయం ఆమెను ద‌మ్మాయిగూడ‌లోని వాటర్ ట్యాంక్ దగ్గర వదిలి పారిపోయాడు.
 
 బాలిక ఏడుపు గమనించిన స్థానికులు ఆమె తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలికపై లైంగిక వేధింపులకు గురైందని వైద్య పరీక్షలో తేలింది. దీంతో నిందితుడి కోసం నాలుగు రోజులుగా గాలిస్తుండ‌గా.. నాగారం అట‌వీ ప్రాంతంలో ప‌ట్టుబ‌డ్డాడ‌ని పోలీసులు తెలిపారు.
 
ఇదిలావుంటే, ఈ నెల 9వ తేదీన అదే ప్రాంతంలో మరో తొమ్మిదేళ్ళ బాలికను లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ సంఘటనకు సంబందించిన దృశ్యాలు సీసీ కెమెరాలోకూడా రికార్డ‌య్యాయి. దీంతో ఆదివారం నాటి నేరానికి సంబంధించిన సాంకేతిక ఆధారాలతో పోల్చి చూడ‌గా.. రెండు ఘ‌ట‌న‌ల్లో నిందితుడు ఒకడేన‌ని పోలీసులు నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. విచార‌ణ‌లో నిందితుడు నేరం చేసిన‌ట్టుగా అంగీకరించడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు