పీఎస్‌టీయూ సెట్‌కు కొత్త షెడ్యూల్.. ఆగస్టు 8, 9 తేదీల్లో..

మంగళవారం, 1 ఆగస్టు 2023 (13:47 IST)
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష (పీఎస్‌టీయూ సెట్) కొత్త షెడ్యూలును వర్సిటీ అధికారులు జులై 31న ప్రకటించారు.

తెలంగాణలో భారీ వర్షాల కారణంగా కొత్త షెడ్యూలును విడుదల చేశారు. 2023-24 విద్యా సంవత్సరానికి ఆరు కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 8, 9 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 
 
అభ్యర్థులు ఇటీవల డౌన్‌లోడ్ చేసుకున్న పాత హాల్‌టికెట్లతోనే ప్రవేశ పరీక్షకు హాజరు కావొచ్చని చెప్పారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోలేకపోయిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి పొందవచ్చని అధికారులు సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు