కోవిడ్ బారినపడిన కోలుకున్న చెర్రీ సతీమణి ఉపాసన

బుధవారం, 11 మే 2022 (14:58 IST)
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన కరోనా వైరస్ బారినపడ్డారు. దీనికి చికిత్స తీసుకున్న తర్వాత ఆమె ప్రస్తుతం కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. 
 
చెన్నైలో ఉన్న తాతయ్య, అమ్మమ్మల వద్దకు వెళ్లేందుకు కోవిడ్ పరీక్షలు చేయించుకోగా ఈ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందన్నారు. అయితే, కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల స్వల్ప కరోనా లక్షణాలు మాత్రమే కనిపించాయని పేర్కొన్నారు. 
 
దీంతో అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నానని, చికిత్స సమయంలో పారాసిటమల్, విటమిన్ మాత్రలు మాత్రమే వేసుకుంటే సరిపోతుందని వైద్యులు చెప్పారన్నారు. 
 
తనకు కరోనా సోకడంతో బాడీ పెయిన్స్, జట్టు ఊడిపోవడం, నీరసం వంటి సమస్యలు రావొచ్చని కొందరు చెప్పారని అయితే, తనకు అలాంటి ఏ సమస్యా రాలేదని చెప్పారు. 
 
కోవిడ్ పరీక్షలు చేయించుకోకపోతే తనకు కరోనా వైరస్ సోకిందన్న విషయమే తెలిసేది కాదన్నారు. ఈ సందర్భంగా తనకు చికిత్స చేసిన వైద్యులు డాక్టర్ సుబ్బారెడ్డి, డాక్టర వీరప్రకాష్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు