బుల్లి 'మగధీర' మరి లేడు... కామెర్ల వ్యాధితో కన్నుమూశాడు...

శనివారం, 15 జులై 2017 (21:48 IST)
తెలంగాణ నేలపై, పొలాల్లో బాగా జుట్టు పెంచుకుని చిన్న బుడతడు ఒకడు మగధీర చిత్రం డైలాగులు చెప్పడాన్ని అంతా చూసే వుంటారు. రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రాన్ని మూడుసార్లు చూశానని, ఆ చిత్రంలో డైలాగులు వల్లె వేస్తుంటే అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. విధి వక్రించి ఆ బుల్లి మగధీర పరశురామ్ పచ్చకామెర్ల వ్యాధితో కన్నుమూశాడు. 
 
ఆ బాలుడిని ప్రత్యేకంగా పిలిపించి అతడి డైలాగులు విని అతడిని అభినందించిన రాంచరణ్ ఈ వార్త విని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. 
 
కాగా పరశురామ్ మహబూబ్‌ నగర్‌లోని అయిజ మండలానికి చెందినవాడు. అప్పట్లో మగధీర చిత్రం డైలాగులు చెప్పి పాపులర్ అయ్యాడు. రాంచరణ్ ఆ బాలుడికి బహుమతులు ఇవ్వడమే కాకుండా అతడిని పాఠశాలలో చేర్పించాడు. ఐతే అనుకోకుండా అతడు కామెర్ల వ్యాధికి బలయ్యాడు.

వెబ్దునియా పై చదవండి