అప్పు తిరిగి చెల్లించని అడిగినందుకు వదినను అలా వేధించిన మరిది...

బుధవారం, 21 ఏప్రియల్ 2021 (11:08 IST)
తన వద్ద అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించమని కోరినందుకు వదినను ఆమె మరిది కాల్ ఉమెన్‌గా మార్చేశాడు. అలాగే, అన్నను కూడా వేధించాడు. రంగారెడ్డి జిల్లా మార్గుల మండలం, కలకొండలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన నగిళ్ళ యశ్వంత్‌ వరుసకు వదిన అయ్యే బంధువు వద్ద రూ.2 వేలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి చెల్లించపోవడంతో ఆ విషయం ఆమె యశ్వంత్‌ అమ్మానాన్నల దృష్టికి తీసుకెళ్ళింది.  దాంతో తల్లిదండ్రులు అతడిపై కోపగించురున్నారు. 
 
దీన్ని మనసులో పెట్టుకున్న యువకుడు.. ఎలాగైనా వదిన, ఆమె భర్త పరువును బజారుకీడ్చాలని పథకం వేశాడు. వదిన మొబైల్‌ నంబర్‌ను ‘షేర్‌ చాట్‌’ అప్లికేషన్‌లో పోస్టు చేశాడు. ‘హాయ్‌..! ఐయామ్‌ ఆంటీ.. నాకు పెళ్లయింది ఒక కొడుకు ఉన్నాడు.. మా ఆయన వేస్ట్‌ ఫెలో. ఇంట్రెస్టు ఉన్నవారు కాల్‌ చేయండి’ అంటూ మెసేజ్ పోస్ట్ చేశాడు. 
 
దాంతో పోకిరీలు, ఆకతాయిలు రాత్రి, పగలు ఆమెను వేధింపులకు గురిచేస్తున్నారు. దాంతో బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా నిందితుడి ఆటకట్టించి కటకటాల్లోకి నెట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు