హైదరాబాదులో గురువారం సాయంత్రం సద్దుల బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం లాల్ బహదూర్ స్టేడియం నుంచి బతుకమ్మల ఊరేగింపు ప్రారంభమైంది. తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఈ ఊరేగింపులో బతుకమ్మలను నెత్తిపై పెట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నారు.