తెలంగాణ ఆర్టీసి ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్

శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (11:34 IST)
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఎండీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌ భవన్‌లో శుక్రవారం సజ్జనార్‌ ఎండీగా బాధ్యతలు చేపట్టారు.

సజ్జనార్‌ అంతకుముందు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. మూడేళ్ల పాటు సైబరాబాద్‌ సీపీగా పని చేసి నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నారు. 2009లో దేశంలోనే సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసులో సజ్జనార్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సజ్జనార్‌ గతంలో సీఐడీ, ఇంటిలిజెన్స్‌ విభాగాల్లో పని చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు