తెలంగాణా నిరుద్యోగుల కోసం రేపు ష‌ర్మిల నిరాహార దీక్ష‌...!

సోమవారం, 19 జులై 2021 (15:15 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిరుద్యోగుల నిర‌స‌న‌లు న‌డుస్తుండ‌గా, రేపు తెలంగాణాలో నిరుద్యోగుల కోసం వై.ఎస్.ఆర్.టి.పి. నేత ష‌ర్మిల నిరాహార దీక్ష చేయ‌నున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని గంగదేవిపాడులో ఈ నెల 20న వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఆ పార్టీ రాష్ట్ర నేత కొండా రాఘవరెడ్డి ఈ వివరాలు వెల్లడించారు.
 
రేపు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు షర్మిల దీక్ష కొనసాగిస్తారని, తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల నుంచి నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలపాలని కోరారు. మ‌రో ప‌క్క ఆంధ్ర‌లో ష‌ర్మిల అన్న సీఎం వై.ఎస్. జ‌గ‌న్ వెల‌వ‌రించిన జాబ్ క్యాలండ్ పైన ఇక్క‌డ తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి.
 
నిరుద్యోగ యువ‌కులు ప్ర‌తిప‌క్షాల ఆధ్వ‌ర్యంలో సీఎం జ‌గ‌న్ ఇంటిని ముట్ట‌డించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనితో పోలీసులు చాలా మంది యువ‌కుల‌ను అరెస్టు కూడా చేశారు. ఇలాంటి త‌రుణంలో తెలంగాణాలో ష‌ర్మిల నిరుద్యోగుల త‌ర‌ఫున నిరాహార దీక్ష చేయ‌డం రాజ‌కీయ దుమారాన్ని రేపుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు