సంగారెడ్డిలో విషాదం.. ఎయిర్‌గన్ పేలి బాలిక మృతి

బుధవారం, 16 మార్చి 2022 (11:26 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఎయిర్‌గన్ పేలి ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. పిల్లలంతా కలిసి ఆడుకుంటుండగా ఈ విషాద ఘటన జరిగింది. 
 
ఈ ఘటన జరిగిన వెంటనే ఆ బాలికను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, ఆ బాలిక అప్పటికే ప్రా.ణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు