ఎన్టీఆర్‌కు కాదు.. కేసీఆర్‌కు భారతరత్న ఇవ్వాలట...

మంగళవారం, 24 అక్టోబరు 2017 (08:11 IST)
ఆంధ్రుల ఆరాధ్య నటుడు, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్.టి. రామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఆ దిశగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. 
 
అయితే, ఇపుడు ఓ సరికొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. అదేంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ ఐకాస కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. 
 
రాష్ట్రాన్ని శాంతియుత మార్గం వైపు తీసుకెళ్తున్న కేసీఆర్‌ను ఈ నెల 25న రవీంద్రభారతిలో సత్కరించి ‘శాంతిదూత’ బిరుదు ఇవ్వనున్నట్లు ఐకాస నాయకులు తెలిపారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో మత ఘర్షణలకు తావులేకుండా శాంతియుత వాతావరణం నెలకొందని వారు పేర్కొంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు