కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

శనివారం, 26 మార్చి 2022 (11:32 IST)
తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో వున్న బీజేపీ సర్కారు క్షమాపణలు చెప్పే పరిస్థితి వస్తుందని తెలంగాణ మంత్రులు అన్నారు. ఈ పరాభవాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రులు మండిపడ్డారు. 
 
కేంద్ర ప్రభుత్వానికి వ్యాపార ధోరణితో వ్యవహరించడం తప్పితే.. సంక్షేమం గురించి ఆలోచించే మనసే లేదని తెలంగాణ మంత్రులు తెలిపారు. ఏ అంశంలోనూ నవ్యత్వం లేదని తెలంగాణ మంత్రులు చెప్పారు. 
 
ముఖ్యమంత్రి ఆలోచించి తదుపరి కార్యాచరణ ఖరారు చేస్తామని తెలంగాణ మంత్రులు ప్రెస్ మీట్ ద్వారా తెలిపారు. రైతుల ప్రయోజనాలను తమ ప్రభుత్వం పరిరక్షిస్తుందని.. తెలంగాణ రైతులు అధైర్యపడవద్దని నిరంజన్ రెడ్డి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు