వేడి వేడి బజ్జీల కోసం సైరన్ మోగించిన ఆంబులెన్స్ డ్రైవర్ (వీడియో వైరల్)

బుధవారం, 12 జులై 2023 (16:38 IST)
Ambulance
వర్షాకాలం వేడి వేడి బజ్జీలు తినాలనుకుని అంబులెన్స్ డ్రైవర్ ఏం చేశాడో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. చిప్స్, బజ్జీలు కొనేందుకు తెలంగాణలో అంబులెన్స్ డ్రైవర్ రోడ్డు సైడ్ అంబులెన్స్ నిలిపేసిన వీడియా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
 
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఓ అంబులెన్స్ సైరన్ మోగిస్తూ రోడ్డుపైకి దూసుకెళ్లింది. కానీ అంబులెన్స్ ప్రమాద స్థలానికి లేదా ఆసుపత్రికి వెళ్లకుండా రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్ ముందు ఆగింది. ఈ అంబులెన్స్‌లో పేషెంట్‌ లేకపోయినా సైరన్‌ మోగింది.
 
దీంతో అంబులెన్స్ డ్రైవర్‌ను విచారించారు. తన అవసరాల కోసం సైరన్‌ మోగించి ట్రాఫిక్‌ ఉల్లంఘనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. రోడ్డుపై సిగ్నల్ వద్ద నిలబడి ఉన్న ఓ ట్రాఫిక్ పోలీసు ఈ విషయాన్ని గమనించాడు.
 
దీనిపై కానిస్టేబుల్ అంబులెన్స్ డ్రైవర్‌ను విచారించడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

#TelanganaPolice urges responsible use of ambulance services, citing misuse of sirens. Genuine emergencies require activating sirens for swift and safe passage. Strict action against abusers is advised.

Together, we can enhance emergency response and community safety. pic.twitter.com/TuRkMeQ3zN

— Anjani Kumar IPS (@Anjanikumar_IPS) July 11, 2023

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు