రెండో పెళ్లి చేసుని కాపురం పెట్టిన భర్త.. దేహశుద్ధి చేసిన తొలి భార్య

మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (21:48 IST)
తొలి భార్య ఉండగానే గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకొని కాపురం పట్టిన భర్తను పట్టుకొని దేహశుద్ధి చేసింది మొదటి భార్య.. ఈ ఘటన సోమవారం కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి జిల్లా ముఠాకొండూరు మండలం చేర్యాల గ్రామానికి చెందిన పరశురాం బోర్‌వేల్స్‌ వ్యాపారం చేస్తుంటాడు. పరశురాంకి, ధనలక్ష్మీతో కొన్నేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. 
 
వీరంతా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. అయితే వ్యాపరం నిమిత్తం అన్ని ప్రాంతాలకు తిరిగే పరుశురాం.. మూడు నెలలుగా ఇంటికి తిరిగి వెళ్లలేదు. దీనితో అనుమానం వచ్చి ఆరా తీయగా.. కామారెడ్డికి చెందిన కవిత అనే ఓ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుని అశోక్‌నగర్‌లో ఉంటున్నాడని తెలిసింది. 
 
దీనితో ధనలక్ష్మి సోమవారం బంధువులతో కలిసి వచ్చి భర్తను చితకబాదింది. తనకు మాయమాటలు చెప్పి అన్యాయం చేశాడని పరుశురాం రెండో భార్య కవిత ఆరోపించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు