ఉత్తరాఖండ్ ప్రకృతి విలయంలో వేలాదిమంది నిరాశ్రుయలయ్యారు. ఈ వరద బాధితులకోసం బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ తన వంతు సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం పలువురు బాలీవుడ్ నటీనటులతో నిర్వహించే టెలివిజన్ షోలో డ్యాన్స్ చేయనుంది. ఇందులో దాదాపు దేశభక్తి పాటలకు ఐశ్వర్య నృత్యం చేయనుంది.
ఈ కార్యక్రమంలో అభిషేక్ బచ్చన్ కూడా పాల్గొననున్నాడు. దీనిద్వారా వచ్చిన నిధులను ఉత్తరాఖండ్ బాధితులకు అందించనున్నారని ప్రముఖ వార్తా వెబ్ సైట్ తెలిపింది. ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, బిపాసాబసు, మాధురీ దీక్షిత్, అభయ్ డియోల్, నేహా ధూపియా వంటి పలువురు స్టార్లు తమ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ను ఇవ్వనున్నారు. సంగీత మాంత్రికుడు ఏ ఆర్ రెహమాన్, గాయకురాలు లతా మంగేష్కర్ తమ పాటలతో ప్రేక్షకులను అలరించనున్నారు.