తారల ప్రేమ వివాహం

గురువారం, 7 ఫిబ్రవరి 2008 (21:14 IST)
ఒకానొకప్పుడు అనగా 1967 సంవత్సరంలో బాపు దర్శకత్వంలో విడుదలైన 'సాక్షి' చిత్రంలో వీరిరువురు కలిసి నటించారు. ఆ చిత్ర కథను అనుసరించి వారిరువురి వివాహం శ్రీకృష్ణుని దేవాలయంలో జరుగుతుంది. దీనిని గమనించిన హాస్యనటుడు రాజబాబు ఈ గుడిలో సినిమా పెళ్లి చేసుకున్నప్పటికీ నిజజీవితంలో దంపతులు అవుతారని సెలవిచ్చారు.

రాజబాబు వాక్కులో మహిమో లేక దేవాలయ మహత్మ్యమో తెలియదు కాని కృష్ణ, విజయనిర్మలలు కొద్ది కాలానికే వివాహం చేసుకున్నారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో నూతన అధ్యాయాలకు శ్రీకారం చుడుతూ వైవిధ్యభరితమైన సినిమాలతో నటశేఖర కృష్ణ స్టార్‌డమ్‌కు చేరుకోగా, అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా విజయనిర్మల గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్నారు.

వెబ్దునియా పై చదవండి