కృష్ణవంశీ పెట్టే కష్టాలు నేను పడలేను.. అందుకే నటించలేదు: చిరంజీవి

మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (19:05 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న దర్శకుల్లో అత్యంత ప్రతిభావంతులైన వారిలో కృష్ణవంశీ ఒకరని, అందుకే ఆయన పెట్టే పరీక్షను రాయలేక ఆయన దర్శకత్వంలో నటించలేదని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చాడు. తనకంటూ ప్రత్యేకమైనశైలి వుందన్నారు. పాటలు, డ్యాన్సులు, స్టెప్పులతో తనకు అనుగుణంగా సినిమాలో నటిస్తానని చెప్పారు. కానీ, కృష్ణవంశీ దర్శకత్వంలో నటించాలంటే ఆయన పెట్టే నటన పరీక్షతో పాటు.. కష్టపడాల్సి ఉందన్నారు. ఈ వయస్సులో నాకు అవి అవసరమా అని అనుకుని ఆయన దర్శకత్వంలో నటించలేక పోయినట్టు తెలిపారు. 
 
"గోవిందుడు అందరివాడేలే" చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరుగగా, ఇందులో చిరంజీవి పాల్గొని ప్రసంగించారు. నేనెప్పుడూ కృష్ణవంశీ దర్శకత్వంలో పని చేయాలని అనుకోలేదన్నాడు. ఎందుకంటే అతి కత్తిమీద సాములాంటిదన్నారు. ప్రతీ నటుడికీ ఒక్కో చిత్రం ఒక్కో పరీక్ష. ఇన్ని సినిమాలు చేశాక. ఇలాంటి పరీక్షలు ఎదుర్కోవడం అవసరమా అనిపించింది. అందుకనే ఆయన పెట్టే పరీక్షను రాయలేక చిత్రం చేయలేదని చిరంజీవి చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి