''పరుచూరి బ్రదర్స్ నుంచి ఏం నేర్చుకోవాలో అది నేర్చుకున్నాను. ఏమి నేర్చుకోకూడదో అది నేర్చుకోలేదు. అదేమిటంటే.. కష్టపడినదానికి డబ్బులు అడగడం. గురువులకు మొహమాటం.. కానీ నేను నా స్టైల్లో కష్టపడితే వెంటనే డబ్బులు అడగుతాను'' అంటూ పోసాని కృష్ణమురళి అన్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు పుట్టినరోజు శనివారం నాడు జరిగింది.
పోసాని మాట్లాడుతూ... కళామతల్లికి సేవ చేయాలని ఎవ్వరూరారు. పరుచూరి వెంకటేశ్వరావు కష్టపడి చదువుకుని పైకి ఎదిగి.. ప్రభుత్వ ఉద్యోగం వదులుని సినిమా రంగంలోకి వచ్చారు. కానీ ఏమీ సంపాదించుకోలేకపోయారు. నాలాగే వుంటే ఈపాటికి 500 కోట్లు సంపాదించేవారు. సినిమాకు కష్టపడి రాసినా... డబ్బులు తర్వాత ఇస్తామంటే అలాగే ఇంటికి వచ్చి బాధపడే రోజులు నేను చూశాను.. అంటూ వ్యాఖ్యానించారు.