'రుద్రమదేవి' అనుష్క బంగారం కథ ఏమైంది?

శనివారం, 1 నవంబరు 2014 (17:31 IST)
నటి అనుష్క నటిస్తున్న 'రుద్రమదేవి' సినిమా షూటింగ్‌లో ఒంటిపై ఒరిజినల్‌ ఆభరణాలకు ఒరిజినల్‌ బంగారు నగలు చెన్నై నుంచి వచ్చాయనీ, అవి తర్వాత మాయమై పోయాయనీ వార్తలు రావడం అది పెద్ద చర్చ జరగడం వెంటవెంటనే జరిగిపోయాయి. 
 
అసలు షూటింగ్‌లో ఒరిజినల్‌ ఎందుకు వాడతారు? అంటూ కొందరు ప్రశ్నించడంతో చర్చకు అవకాశం వచ్చింది. దీనిపై అప్పటి సైబరాబాద్‌ పోలీసు కమీషనర్‌ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఇదంతా  ఒట్టి డ్రామానేనని.. దీని వెనుక దర్శకుడు గుణశేఖ్‌ హస్తం వుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఆ వ్యవహారం ఏమిటో త్వరలో తేలనుందంటున్నారు.

వెబ్దునియా పై చదవండి